వాషింగ్టన్, అక్టోబర్ 18 : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ శ్వేతసౌధంలో భారత అమెరికన్ అడ్మినిస్ట్రేషన్ సభ్యులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. "భారత అమెరికన్ కమ్యూనిటీతో కలిసి ఈ దీపావళి వేడుకల్లో పాల్గొనడం నాకు చాలా గర్వంగా ఉంది. అతిపెద్ద ప్రజాస్వామ్యాన్ని నిర్మించిన గొప్ప ప్రజలు భారతీయులు. భారత ప్రధాని మోదీతో తమ దేశానికి ఉన్న సంబంధాలకు నేను చాలా విలువనిస్తాను. భారత్ అమెరికన్ మిత్రులు అమెరికా అభివృద్ధి కోసం చాలా కృషి చేస్తున్నారు. భారత పౌరులందరికీ నా కృతజ్ఞతలు. అమెరికాలో ఉన్న ప్రతి ఒక్కరికి దీపావళి శుభాకాంక్షలు మీ ట్రంప్" అంటూ తన ఫేస్బుక్ ఖాతా ద్వారా పంచుకున్నారు. ఈ వేడుకల్లో ఐరాసకు అమెరికా రాయబారి నిక్కీ హేలీ, సెంటర్ ఫర్ మెడికేర్ అడ్మినిస్ట్రేటర్ సీమా వర్మ, యూఎస్ ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ చైర్మన్ అజిత్ పాయ్ తదితర భారత అమెరికన్లు పాల్గొన్నారు.