అమరావతి, అక్టోబర్ 16: ప్రస్తుతం ప్రైవేటు కళాశాలల్లో విద్యార్ధులు ఆత్మహత్యకు పాల్పడుతున్న నేపధ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కళాశాల యాజమాన్యంతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ...విద్యార్ధులను రోజులో ఎక్కువ సమయం చదువుకి పరిమితం చేసే సమయపాలనాలో మార్పులు తీసుకురావాలి. వారిని రోబోలుగా మార్చే విద్యా విధానాన్ని సహించేది లేదన్నారు. విద్యార్ధులను వేధించే పద్దతులను తక్షణం వదిలిపెట్టాలి, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మూడు నెలలకోసారి కళాశాల యాజమాన్యంతో సమావేశం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. విద్యార్ధులను కళాశాల యాజమాన్యం, తల్లిదండ్రులు మార్కులు, ర్యాంకుల కోసం వేధించవద్దన్నారు.