ప్రజల ఆక్రందనను పట్టించుకునే తీరిక లేదా..?

SMTV Desk 2017-10-14 19:20:15  ap cm, chandrababu naidu, YS JAGAN, RAINS

అమరావతి, అక్టోబర్ 14: రైతుల కష్టం మీకు కనిపించడం లేదా ? ప్రభుత్వానికి ప్రజలను పట్టించుకొనే తీరిక లేదా ? అంటూ ప్రశ్నిస్తూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, ఏపీ సిఎం చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. అటు ప్రజల ఇక్కట్లు, ఇటు రైతుల ఆవేదనకు నిరసనగా జగన్ లేఖలో పేర్కొన్నారు.