న్యూఢిల్లీ, అక్టోబర్ 14 : దీపావళి కానుకగా ఇప్పటికే టెలికాం దిగ్గజాలు జియో, ఎయిర్టెల్ కంపెనీలు వినియోగదారులకి బంపర్ ఆఫర్లు ప్రకటించాయి. అయితే వీటికి కౌంటర్ ఇచ్చేలా వొడాఫోన్ భారీ ఆఫర్తో ముందుకొచ్చింది. జియో, ఎయిర్టెల్ మాదిరిగానే రూ.399కి కొత్త ప్లాన్ ని ప్రకటించింది. ఈ ప్లాన్ కింద రూ.399తో రీచార్జ్ చేసుకున్న వారికి ఆరు నెలల కాలపరిమితితో 90 జీబీ 4G డేటా అందిస్తున్నట్లు ప్రకటించింది. దీంతోపాటు అదనంగా అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్ చేసుకునే సదుపాయం కల్పించింది.