వరంగల్, అక్టోబర్ 14 : నేడు ఐటీ శాఖమంత్రి కేటీఆర్ వరంగల్ లో పర్యటిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ పర్యటనపై స్థానిక నేతలతో చర్చించేందుకు కేటీఆర్ నగరానికి చేరుకోగా, కలెక్టర్, మేయర్, మున్సిపల్ కమిషనర్ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా హన్మకొండ టాస్క్ ప్రాంతీయ కేంద్రం ప్రారంభించనున్న కేటీఆర్ అనంతరం నిట్ విద్యార్ధులతో సమావేశం కానున్నారు. పలు కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకోనున్నారు. అలాగే గీసుకొండ పరిధిలో ఉన్న మెగా టెక్ టైల్స్ పార్కు స్థలాన్ని పరిశీలిస్తారు. సాయంత్రం వరంగల్ నగర అభివృద్ధిపై అధికారులతో ఆయన సమీక్షించనున్నారు.