విజయవాడ, అక్టోబర్ 14 : విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మొదటగా పాత బస్టాండ్ వద్ద నున్న వ్యర్థాలతో కూడిన పార్కును పరిశీలించిన ఆయన ఇక్కడ ఒక వాకింగ్ ట్రాక్ ను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశిస్తూ.. పలు సూచనలు చేశారు. అక్కడే బందరు కాల్వను ఆనుకొని ఉన్న పచ్చదనం పెంపు కార్యక్రమాన్ని పరిశీలించారు. ఆ తర్వాత కనకదుర్గ ఫ్లైఓవర్ను, అక్కడ జరిగే పలు అభివృద్ధి పనులను ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కృష్ణా జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.