హైదరాబాద్, అక్టోబర్ 11: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడూ పర్యటనలు, సమావేశాలతో బిజీ బిజీగా ఉంటారు... కొంచెం కూడా తీరిక లేకుండా ఉండే సీఎం తమ మిత్రులను మరువలేదంటే అది ఆయనలోని ప్రత్యేకతే.. పర్యటనలో భాగంగా జిల్లా సమీకృత కార్యాలయాల శంకుస్థాపన కోసం నేడు కేసీఆర్ సిద్దిపేట జిల్లాకు బయలు దేరారు మార్గ మాధ్యమంలో ములుగు అనే జాతీయ రహదారిపై తన బాల్య మిత్రులు జహంగీర్, అంజిరెడ్డిలు కనిపించడంతో కాసేపు కాన్వాయ్ని ఆపి మరీ వారిని పలకరించారు. అంతేకాకుండా అనంతరం సిద్దిపేట పర్యటనకు తన వాహనంలో ఆ మిత్రులను తీసుకెళ్లారు. ఈ సందర్భాన్ని ఊహించని అధికారులు స్థానికులు ఆఖరుకి ఆయన మిత్రులు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు.