న్యూఢిల్లీ, అక్టోబర్ 10 : ఆడపిల్లలకు విద్య అవసరం అంటూ చాటి చెప్పినందుకు పాకిస్థానీ అమ్మాయి మలాలా యూసుఫ్ జాయ్ పై కాల్పులు జరిగిన సంగతి విదితమే. ఆమె ధైర్య సాహసాలకు మెచ్చి కేంద్రం నోబెల్ బహుమతి కూడా అందించింది. అయితే తాజాగా మాలాలా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో మొదటి రోజు తరగతులకు హాజరైంది. ఈ సందర్భంగా ఆమె పాత విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. "ఐదేళ్ల క్రితం ఆడపిల్లల చదువు కోసం చేసిన ప్రయత్నంలో కాల్పులకు గురయ్యాను. ఇప్పుడు అదే నేను ఇవాళ ఆక్స్ఫర్డ్లో తొలి తరగతులకు హాజరయ్యాను" అంటూ పోస్ట్ చేశారు. దీంతో నెటిజన్లందరూ ఆమెకు అభినందనలు తెలియజేశారు. అంతేకాకుండా ఆమె ట్వీట్ ను లైక్ చేస్తూ విపరీతంగా షేర్ చేస్తున్నారు.