కేంద్ర రక్షణశాఖ మంత్రికి చైనా మీడియా ప్రశంసలు..

SMTV Desk 2017-10-10 10:51:10  Union Defense Minister, Nirmala Sitharaman, Nathu laa tour of Sikkim, Chaina media.

న్యూఢిల్లీ, అక్టోబర్ 10 : కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల సిక్కింలోని నాథులా సరిహద్దు ప్రాంతంలో పర్యటించారు. ఈ విషయంపై అక్కడి చైనా మీడియా ఆమెపై ప్రశంసల జల్లు కురిపించింది. గత కొద్ది రోజులుగా నాథులా సమీపంలో ఉన్న డోక్లాంలో చైనా సైన్యం రహదారి పనులను ప్రారంభించింది. ఈ పనులను భారత సైన్యం అడ్డుకోగా.. చైనా మాత్రం సరిహద్దు ప్రాంతంలో భారీ భద్రతా బలగాలను మోహరించింది. సుదీర్ఘ మంతనాల తరువాత ఇరుదేశాల మధ్య ప్రశాంతత వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో అక్కడి పరిస్థితులను అధ్యయనం చేయడానికి కేంద్రమంత్రి సరిహద్దు ప్రాంతంలో పర్యటిస్తున్న క్రమంలో.. భారత సరిహద్దుకు అవతల వైపున ఉన్న చైనా సైనికులతో సంభాషించడాన్ని చైనా ప్రసార మాధ్యమాలు స్వాగతించాయి. అంతేకాకుండా ఈ అంశాన్ని చైనా ప్రభుత్వ సారథ్యంలోని సీజీటీఎన్‌ ప్రధానంగా ప్రస్తావించింది.