హైదరాబాద్ అక్టోబర్ 10: కల్యాణ్ రామ్ హీరోగా ఉపేంద్ర మాధవ్ దర్శకుడు గా ఓ చిత్రం తెరకెక్కుతుంది. ఈ సినిమాలో కథానాయిక తమన్నా నటిస్తున్నారు. ఇప్పటివరకు కొత్త హీరొయిన్ లను ఎక్కువగా తీసుకున్న కళ్యాణ్ రామ్, ఈ సారి స్టార్ హీరొయిన్ లపై దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. చివరి రెండు చిత్రాలు ఆశించిన ఫలితాల్ని ఇవ్వకపోవడంతో ఆశలన్ని ఈ చిత్రం పైనే పెట్టుకున్నారు. తొలి షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకొంది. ఇందులో నాయకానాయికలపై ఓ రొమాంటిక్ గీతాన్ని చిత్రీకరించారు. ‘చినికి చినికి వలపు వాన తడి...’ అంటూ సాగే ఈ గీతాన్ని అనంత్శ్రీరామ్ రచించారు. పాటకు బృంద మాస్టర్ నృత్య రీతులు సమకూర్చారు. దీంతోపాటు కల్యాణ్ రామ్పై ఓ స్ట్రీట్ ఫైట్ కూడా చిత్రీకరించారు. తదుపరి షెడ్యూల్ నవంబరులో ప్రారంభమవుతుంది. డిసెంబరు ఆఖరుకు చిత్రీకరణ పూర్తవుతుంది. ఫిబ్రవరి ఆఖరు లేదా మార్చి ప్రథమార్ధంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర బృందం ప్రయత్నాలు చేస్తోంది.