.న్యూఢిల్లీ, అక్టోబర్ 09 : దేశ రాజధాని న్యూఢిల్లీలో ఓ సంఘటన పెను దుమారం రేపింది. దక్షిణ ఢిల్లీలోని మాల్వా నగర్ లో దొంగతనం చేశాడని ఓ ఆఫ్రికా దేశస్థున్ని స్థానికులు స్తంభానికి కట్టేసి విచక్షణారహితంగా కొట్టారు. ఈ సంఘటన వారం రోజుల క్రితం జరిగినప్పటికి దీనిపై ఒక వీడియో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అప్పట్లో అతనిపై దొంగతనం చేసి పారిపోతూ తప్పించుకునే సందర్భంలో గాయాలయ్యాయని స్థానికులు కేసు నమోదు చేశారు. అయితే దర్యాప్తులో భాగంగా ఇది నిజం కాదని తెలియడంతో దాడిచేసిన వారిపైనే పోలీసులు కేసు నమోదు చేశారు.