హైదరాబాద్, అక్టోబర్ 08 : రొమ్ము క్యాన్సర్ ను తొలి దశలోనే గుర్తిస్తే చికిత్స సులభమని ప్రముఖ వైద్యులు రఘు రామ్ వర్ణించారు. హైదరాబాద్ కేబీఆర్ పార్కు వద్ద కిమ్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో రొమ్ము క్యాన్సర్ పై అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. పింక్ రిబ్బన్ పేరుతో నిర్వహించిన వాక్ కు సీని నటి తమన్నా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ మీదుగా తిరిగి ఉద్యానవనం వరకు అవగాహన నడకను నిర్వహించారు. ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ.. దగ్గు, జలుబు ఎంత సాధారణ జబ్బులో క్యాన్సర్ కూడా అంత సాధారణంగా మారిందని, ఇలా చెప్పుకోవడం బాధాకరమని అన్నారు. ఒక నటిగా రొమ్ము క్యాన్సర్పై అవగాహన కల్పించేందుకు తాను రావడం వల్ల ఎక్కువ మంది ప్రభావితులవుతారని.. అందుకే ఇలాంటి మంచి కార్యక్రమాలకు తన పూర్తి మద్దతును తెలిపినట్లు చెప్పారు.