డోక్లాంలో రక్షణ మంత్రి పర్యటన..

SMTV Desk 2017-10-08 13:35:45  Union Defense Minister, Nirmala Sitharaman, Doklam, Commandant Lt. Abhay Krishna Guard

డోక్లాం, అక్టోబర్ 8 : కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సిక్కింలో పర్యటించారు. హిమాలయాలలోని ఒక పర్వత మార్గమైన నాథూలా పాస్‌ (ఇది చైనా యొక్క టిబెట్ స్వాధికార ప్రాంతంతో సిక్కిం భారత రాష్ట్రాన్ని కలుపుతుంది), సిక్కి౦, అరుణాచల్‌ ప్రదేశ్‌లోని పలు కీలక ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం మంత్రి ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ (ఐటీబీపీ) అధికారులతో ప్రత్యేకంగా సమావేశమై.. డోక్లాం, అరుణాచల్‌ ప్రదేశ్‌ సరిహద్దు ఏరియల్‌ సర్వే నిర్వహించారు. అంతేకాకుండా సిక్కింలో కొత్తగా నిర్మించిన విమానాశ్రయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా నాథూలా పాస్‌ చేరుకున్న రక్షణమంత్రికి ఈస్ట్రన్‌ కమాండెంట్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ ఆభయ్‌ కృష్ఱ గార్డ్‌ ఆనర్‌ ద్వారా గౌరవించారు. ఈ క్రమంలో ఆమెను అక్కడ పహారా కాస్తున్న కొందరు చైనా సైనికులు ఫోటోలు తీసేందుకు ప్రయత్నించారంటూ ఆమె ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు.