బెట్టింగ్ అలవాటుకు బలైన బాలుడు..

SMTV Desk 2017-10-07 19:26:22  vijayawada, krishnalanka, betting case, murder

విజయవాడ, అక్టోబర్ 7: బెట్టింగ్ కు అలవాటుపడి ఇద్దరు కిరాతకులు బాలుడిని హతమార్చిన ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం... విజయవాడ కృష్ణలంకకు చెందిన ఒక బాలుడిని చుట్టూ ప్రక్కల ఐస్ క్రీం విక్రయించే మస్తానీ అనే వ్యక్తి కిడ్నాప్ చేశాడు. అనంతరం ఆ బాలుడి తండ్రికి ఫోన్ చేసి లక్ష రూపాయలు ఇస్తేనే బాలుడు బ్రతుకుతాడు లేదంటే చంపేస్తా అంటూ బెదిరించాడు. దీంతో కంగారు పడిన ఆ తల్లిదండ్రులు డబ్బులు ఇస్తాము కానీ మా కుమారుడిని ఎం చేయొద్దు అంటూ ప్రాధేయపడ్డారు. మరి కాసేపట్లోనే ఆ కిరాతకులు బాలుడిని చంపేశామ౦టూ ఆ తండ్రికి ఫోన్ చేశాడు. వెంటనే ఆ తండ్రి పోలీసులను ఆశ్రయించగా వారు బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు చేపట్టి ఎట్టకేలకు ఆ నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అందులో ఒకరు ఇంటర్ విద్యార్ధి కాగా, మరొకరు ఐస్ క్రీం విక్రయించే మస్తానీ (బిల్లా) అని తెలిపారు. పోలీసులు వారిని విచారించగా బెట్టింగ్ కోసం డబ్బు అవసరమై బాలుడిని అపహరించి హతమార్చినట్లు వెల్లడించారు. కాగా బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు.