అనుమానానికి నిండు ప్రాణం బలి...

SMTV Desk 2017-10-07 12:44:33  hyderabad, chinthal, Geethanjali Degree College, crime,

హైదరాబాద్, అక్టోబర్ 7: తనను పెళ్ళిచేసుకోకుండా మరొక వ్యక్తితో చనువుగా కనిపించిన౦దుకు ఏకంగా ఆ యువతిని అంతమొందించి, పోలీసులకు లొంగిపోయిన వైన౦ భాగ్యనగరంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ నగరంలోని గీతాంజలి డిగ్రీ కళాశాలలో చింతల్ ప్రాంతానికి చెందిన సౌమ్య బీకామ్ మొదటి సంవత్సరం చదువుతు౦ది. ఈ నెల5వ తేదిన ఉదయం కళాశాలకు వెళ్ళిన సౌమ్య తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తన తల్లిదండ్రులు జీడిమెట్లలోని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం...సౌమ్యకు దూరపు బంధువైన కృష్ణయ్యతో పెద్దలు పెళ్లిని నిశ్చయించారు. కాగా గత 6 నెలలుగా సౌమ్యపై అనుమానం పెంచుకున్న కృష్ణయ్య తనతో మాట్లాడాలంటూ ఈ నెల 5వ తేదిన హెచ్ఎంటి కాలనీలో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్ళాడు. ఈ క్రమంలో మాటామాట పెరిగి కోపంతో ఆమె గుండెలపై బలంగా కొట్టి చనిపోయాక ఆ మృతుదేహాన్ని సంచిలో కట్టి ఐడీఎల్ చెరువులో పడేశాడు. ఒక సంచిలో నిర్జీవంగా పడిఉన్న తమ కూతురి మృతుదేహాన్ని చూసి తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. ఈ ఘటనతో గీతాంజలి డిగ్రీ కళాశాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి.