ఓవల్: చాంపియన్స్ ట్రోపి కి భారత్ సిద్ధం అయింది. మినీ వరల్డ్ కప్ గా పిలువబడే చాంపియన్స్ ట్రోపి కి భారత్ జట్టు రెడీ గా ఉంది. అయితే చాంపియన్స్ ట్రోపి కి ముందు భారత్ జట్టు రెండు వామప్ మ్యాచ్ లు ఆడనుంది.ఫస్ట్ మ్యాచ్ వామప్ మ్యాచ్ ఈ రోజు (ఆదివారం) న న్యూజిలాండ్ తో తలపడనుంది. రెండవ మ్యాచ్ ఈ నెల 30 బంగ్లాదేశ్ తో డీ కొనబోతుంది. ఐతే భారత్ ఫిట్నెస్ సమస్య కొంత ఉంది. సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విని కు ఫిట్నెస్ సమస్య ఉంది. గాయం కారణం గా ఇటివల జరిగిన ఐపీఎల్ మ్యాచ్ ల్లో అతను ఆడలేదు. అతను ఎంత వరకు కోలుకున్నడనేది న్యూజిలాండ్ తో జరిగే వామప్ మ్యాచ్ లో తేలనుంది. ఇక ఫేసర్ మహ్మద్ షామి కి కూడా అదే పరిస్థితి అతను కూడా ఎలా రాణిస్తాడు అని తెలియాలంటే వామప్ మ్యాచ్ లో చూడాలి. ఇటివల జరిగిన ఐపీఎల్ మన బాట్స్ మెన్స్ కూడా అంతగా రాణించలేదు. వారిలో కెప్టెన్ విరాట్ కోహ్లి,రోహిత్ శర్మ,శిఖర్ ధావన్ తదితర ఆటగాళ్ళు ఉన్నారు.వీళ్ళు గడిలో పడడానికి ఈ వామప్ మ్యాచ్ లే ఉపయోగపడుతాయి.