పీసీసీ సభ్యుడిగా ఎంపికైన మెగాస్టార్...

SMTV Desk 2017-10-06 16:40:14  MEGASTAR CHIRANJEEVI, PCC MEMBER, WEST GODAVARI DISTRICT.

ప.గో., అక్టోబర్ 6 : మెగాస్టార్ చిరంజీవి "ప్రజారాజ్యం" పార్టీని స్థాపించి రాజకీయ రంగప్రవేశం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పీసీసీ సభ్యుడిగా మెగాస్టార్ చిరంజీవిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా నుంచి పీసీసీ సభ్యులుగా మొత్తం 17 మందిని ఎంపిక చేసినట్లు సమాచారం. కాగా ఆ పదవి గురించి స్వయంగా చిరంజీవి కోరడంతో ఆయనకు పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు బ్లాక్ 1 నుంచి అవకాశం ఇచ్చినట్టు తెలుస్తోంది. కాగా విజయవాడలో ఈ నెల 10 న పీసీసీ సర్వసభ్య సమావేశం జరిగిన అనంతరం అధ్యక్ష ఎన్నిక జరగనుంది.