హైదరాబాద్, అక్టోబర్ 06 : సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కుమార్తె తనూజ వివాహం గురువారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాద్ హెచ్ఐసీసీలో జరిగిన ఈ వివాహ వేడుకకు రాజకీయ, సినీ, వ్యాపార, న్యాయ ప్రముఖులు హజరయ్యారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ వేడుకలో కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు మంత్రులు నూతన దంపతులను ఆశీర్వదించారు. అలాగే, రామోజీ రావు, సినీ నటులు బాలకృష్ణ, పవన్ కల్యాణ్ లు ఈ వివాహానికి హజరయ్యారు.