టీడీపీ నేతలపై పవన్ ట్వీట్‌..

SMTV Desk 2017-10-06 13:38:52  Janasena party, Pavankalyan, Union Minister, Ashok Gajapati Raju, AP Minister Pithani Satyanarayana.

హైదరాబాద్, అక్టోబర్ 6 : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికరమైన ట్వీట్‌ చేశారు. “కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి పితాని సత్యనారాయణ గారికి పవన్ కళ్యాణ్ అంటే ఎవరో తెలియదు... సంతోషం” అంటూ ట్వీట్‌ చేశారు. ఇటీవల మంత్రి పితానిని పవన్ తో టీడీపీ అనుబంధం కొనసాగుతుందా..? అని ప్రశ్నించగా.. అసలు పవన్ కు ఏపీలో పార్టీ జెండానే లేదు.. అతని గురించి ఆలోచించే సమయం కూడా లేదంటూ వ్యంగ్యాస్త్రాలు చేశారు. అదేవిధంగా మంత్రి అశోక్ గజపతిరాజు కూడా స్పందించడంతో పవన్ ఈ విధంగా ట్వీట్‌ చేసినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ చేసిన ఈ ట్వీట్‌ కు అభిమానుల నుండి విపరీతమైన కామెంట్స్ వస్తున్నాయి. "వారు మీ దగ్గరికి వచ్చి తమను తామే పరిచయం చేసుకునే సమయం త్వరలోనే వస్తుంది అన్నా" అంటూ అభిమానులు రీట్వీట్ చేస్తున్నారు.