అమరావతి, అక్టోబర్ 5 : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భారత ఆర్థిక సదస్సులో పాల్గొనడానికి దిల్లీ పయనమయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసి నిర్ణయాలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో జరుగుతున్న విషయాలు ఎప్పటికప్పుడు దిల్లీ నుండే సమీక్షిస్తానని తెలిపారు. వర్షాల ధాటికి జలమయమైన లోతట్టు ప్రాంతాల వారికి వెంటనే సహాయ చర్యలు అందించేటట్లు ఎల్లప్పుడూ సిద్దంగా ఉండాలని అధికారులను సూచించారు.