హైదరాబాద్, అక్టోబర్ 5 : సింగరేణి కాలరీస్లో కార్మిక సంఘ గుర్తింపు ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సింగరేణి కార్మికులు అధిక సంఖ్యలో పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఈ ఎన్నికల కోసం మొత్తం 92 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్ సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుంది. హైదరాబాద్ సింగరేణి భవన్ సహా దాదాపు 11 ఏరియాల్లో ఇప్పటి వరకు 52 శాతం పోలింగ్ అయినట్లు అధికారులు వెల్లడించారు. కాగా పోలింగ్ అన౦తరం రాత్రి ఏడు గంటలకు ఓట్ల లెక్కింపును ప్రారంభించి ఫలితాలను వెల్లడి౦చనున్నారు.