కొత్తగూడెం, అక్టోబర్ 03 : సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. నేటితో ప్రచారం ముగియనుండగా టీబీజీకెఎస్ తరపున ఎంపీ కవిత కొత్తగూడెంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. వారసత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నవారికి ఉద్యోగ హామీతో పాటు, కార్మికులకు సొంత ఇంటి కోసం రూ.6 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేస్తామన్న ముఖ్యమంత్రి హామీని ప్రస్తావించారు. ఆదాయ పన్ను రద్దు విషయాన్ని పార్లమెంటులో లేవనేత్తుతానని కవిత పేర్కొన్నారు.