పూజల పేరుతో భక్తురాలిపై పురోహితుడి వంచన...

SMTV Desk 2017-09-26 13:09:30  hyderabad, nacharam, sri ram sharma,

హైదరాబాద్, సెప్టెంబర్ 26: పంచకుల వంచకుని లాంటి వారు ఒక పంజాబ్ లోనే కాకుండా ఊరికొకరు తయారవుతున్నట్లు కనిపిస్తుంది. ఇటీవల హైదరాబాద్ నాచారం పరిధిలోని దత్త పీఠ౦ అధిపతి శ్రీ రామ్ శర్మ ఓ భక్తురాలిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూజల పేరుతో లక్షల రూపాయలు వసూలు చేశాడని, ఆ తర్వాత బలాత్కారానికి పాల్పడినట్లు ఒక భక్తురాలు నాచారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు శ్రీ రామ్ శర్మపై సెక్షన్ 354, 428 కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా బాధితురాలు చేసిన ఆరోపణలు అవాస్తవమని శ్రీ రామ్ శర్మ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.