హైదరాబాద్, సెప్టెంబర్ 25: ప్రస్తుతం టాలీవుడ్ లో అగ్రకథానాయికగా దూసుకెళ్తున్న రకుల్ ప్రీత్ సింగ్ తన గ్యారెజ్లో కొత్తగా మరో కారును చేర్చింది. ఇప్పటివరకు ఆడీ క్యూ4 కారును వాడిన రకుల్ తాజాగా మెర్సిడెస్ బెంజ్ కారును కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని ఆమె ట్విటర్ ద్వారా వెల్లడిస్తూ.. ‘నా కొత్త లవ్’ అనే క్యాప్షన్తో ఫొటో షేర్ చేసింది. ప్రస్తుతం బాలీవుడ్, కోలివుడ్ లో ఈ సుందరి తన అదృష్టం పరిక్షించుకుంటుంది. హిందీలో ‘అయారీ’, తమిళంలో ‘థీరన్ అధిగరం ఒండ్రు’ చిత్రాల్లో నటిస్తోంది. ఆమె మహేష్ కు జోడీగా నటించిన ‘స్పైడర్’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.