న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25 : అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీ.వీ. సింధుకు మరో అరుదైన గౌరవం దక్కే అవకాశాలున్నాయి. క్రీడా మంత్రిత్వ శాఖ ఆమె పేరును ప్రతిష్టాత్మకమైన "పద్మభూషణ్" అవార్డుకు సిఫార్సు చేసినట్లు వెల్లడించింది. ఒలింపిక్స్ లో రజత పతకాన్ని గెలిచి ఇండియా కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేసిన సింధు.. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్ లో 2 వ స్థానంలో కొనసాగుతుంది. బ్యాడ్మింటన్లో వివిధ అంతర్జాతీయ టోర్నీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తుడడంతో బీసీసీఐ ఈ అవార్డుకు సింధును ప్రతిపాదించింది. అయితే తాజాగా సింధు కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ ను గెలుచుకున్న విషయం విదితమే. ఇటీవల భారత క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ పేరును కూడా బీసీసీఐ పద్మభూషణ్ అవార్డుకు సిఫారసు చేసి౦ది.