హైదరాబాద్ సెప్టెంబర్ 25 : శర్వానంద్, మెహ్రీన్ జంటగా నటించిన ‘మహానుభావుడు’ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రభాస్ మాట్లాడుతూ.., "శర్వా మా ఇంటి హీరో" అని అన్నారు. ‘‘రన్ రాజా రన్’ చిత్రానికి హీరోగా శర్వానంద్ పేరును వంశీ సూచించారని చెప్పారు. ఆ తరువాత శర్వా నటనకు మేమంతా ఫ్యాన్స్ అయిపోయాం. అలాగే దర్శకుడు మారుతి గురించి మాట్లాడుతూ, ‘డైరెక్టర్ మారుతీ సినిమాలు బాగుంటాయి. పడి పడి నవ్వేలా చేస్తాయి. ఒక మనిషిని నవ్వించాలంటే మామూలు విషయం కాదు. ‘ప్రేమ కథా చిత్రమ్’, ‘భలే భలే మగాడివోయ్’ చిత్రాల్లాగానే ఇది కూడా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా’. తమన్ చక్కని స్వరాలు సమకూర్చారు. చిత్ర బృందం ఈ సినిమా కోసం చాలా కష్టపడింది. ఈ చిత్రం ఘన విజయం సాధించాలని చెబుతూ చివరిగా రేపటి సూపర్స్టార్ మన శర్వా’ అని అన్నారు. ఈ నెల 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.