హైదరాబాద్ లో బతుకమ్మ సంబరాలు

SMTV Desk 2017-09-24 12:52:06  Bathukamma celebrations in thelangana state

హైదరాబాద్, సెప్టెంబర్ 24 : తెలంగాణ రాష్ట్రలోని రాజధానిలో బతుకమ్మ సంబరం ప్రత్యేక శోభను సంతరించుకుంది. కాలనీలు బహుళ నివాస సముదాయాలలో పులా పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు వేడుకలతో సందడిగా మారాయి. ముఖ్యమంత్రి నివాసమైన ప్రగతిభవన్ లో వేడుకలు ఆనందోత్సాహాల నడుమ జరిగాయి. ఈ బతుకమ్మ కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్ సతీమణి విమలా నరసింహన్ , ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభ, ఇతర మంత్రుల సతీమణులు, ఎంపీ కవిత, అమెరికా కాన్సులేట్ జనరల్ కేథరిన్ హడ్డా తదితరులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. జూబ్లిహిల్స్ శాసన సభ్యుడు మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో యూసుఫ్ గూడలోని పోలిస్ మైదానంలో బతుకమ్మ వేడుకలు సందడిగా సాగాయి. భారీగా తరలి వచ్చిన మహిళలు బతుకమ్మలతో ఆడి పాడారు. లలాపేట్ లో ప్రాఫీసర్ జయశంకర్ మైదానంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకల్లో మంత్రి పద్మారావు పాల్గొన్నారు. బతుకమ్మను స్వయంగా ఎత్తుకున్న మంత్రి ఆడపడుచులతో కలిసి ఆడిపాడారు.