చెన్నై సెప్టెంబర్ 23: కంగనా రనౌత్ హీరోయిన్ గా నటించిన ‘క్వీన్’ చిత్రం 2014 లో బాలీవుడ్ లో ఒక సంచలనం సృష్టించింది. ఈ చిత్రానికి నేషనల్ అవార్డ్ తో పాటు, నేషనల్ బెస్ట్ ఫిలిం అవార్డ్ ను కూడా తెచ్చిపెట్టిన విషయం విదితమే. ఈ చిత్రాన్ని దక్షిణాదిలో రీమేక్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే, కంగనా పోషించిన పాత్రను తమిళంలో కాజల్ అగర్వాల్ పోషించనుంది. మొదట్లో ఈ సినిమాకి ప్రధాన పాత్రను పోషించేందుకు తమన్నాను ఎన్నుకోవాలని అనుకున్నారు, కానీ ఆమె తప్పుకోవడంతో చివరిగా కాజల్ని తీసుకున్నారు. ఈ సినిమాకి సంబదించిన ఫస్ట్లుక్ను కాజల్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేసింది. ఈ చిత్రానికి ‘పారిస్ పారిస్’ అనే పేరును ఖరారు చేశారు, రేపటినుండి ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభిస్తున్నట్టు దర్శకనిర్మాతలు మీడియాకి తెలియజేసారు.