హిజ్రాలకు ఒక శుభవార్త...

SMTV Desk 2017-09-23 14:50:08  Amaravathi, ap cm, N. chandrababu naidu, andhrapradesh government

అమరావతి, సెప్టెంబర్ 23: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని తమ ప్రభుత్వం ప్రతి వ్యక్తికి సమానమైన హక్కు, మెరుగైన జీవన ప్రమాణం అందించే దిశగా అడుగులు వేస్తున్నామని, ఈ నేపధ్యంలో సాధారణ మనుషులలాగే హిజ్రాలకు కావాల్సిన అన్ని విధాల సదుపాయాలు కల్పిస్తున్నట్లు గురువారం ప్రకటించారు. వారికి రూ .1000 పెన్షన్, రేషన్ కార్డులు, గృహ సదుపాయాలు ప్రభుత్వం ద్వారా అందజేస్తామని, త్వరలోనే వారికి స్వయం ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ సందర్భంగా... రేషన్, పెన్షన్ లు ప్రభుత్వ పథకాలను హిజ్రాలు ఉపయోగించుకునే విధంగా వారికి హక్కులను జారీ చేయాలని కలెక్టర్లను తన అధికారిక ట్విట్టర్ ద్వారా ఆదేశించానని, ఈ పథకాల ద్వారా వారు ఎవరిపై ఆధారపడకుండా స్వయంగా సమాజంలో వారు గౌరవప్రదంగా జీవనం సాగించాలనే లక్ష్యంతో ఉండాలని చంద్రబాబు నాయుడు తెలియజేశారు.