అమరావతి, సెప్టెంబర్ 22 : విద్య, వైద్య, ఆరోగ్య రంగాల పని తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అహం వీడి సమన్వయంతో పని చేయకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. నాయకత్వం సరిగ్గా ఉంటే ఈ తరహా ఇబ్బందులు ఉండవంటూ ఆయా శాఖల మంత్రులను పరోక్షంగా మందలించారు. లంచాలు తీసుకునే అధికారులపై చర్యలు తీసుకోవడంలో నిర్మొహమాటంగా వ్యవహరించాలని, అప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. కలెక్టర్లు తమ అహంకారాన్ని పక్కనబెట్టి ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.