యూపీ, సెప్టెంబర్ 21 : స్కూల్లో టీచర్ పనిష్మెంట్ ఇచ్చిందని మనస్తాపానికి గురైన ఒక విద్యార్థి.. విషం తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన గోరఖ్పూర్లో చోటుచేసుకుంది. చనిపోయేముందు తన చివరికోరిక ఇది అంటూ ఆ విద్యార్థి సూసైడ్ నోట్ రాసి మరి చనిపోయాడు. వివరాలలోకి వెళితే.. గోరఖ్పూర్ సెయింట్ ఆంటోనీ కాన్వెంట్ స్కూల్లో నవనీత్ ప్రకాశ్(11) అనే విద్యార్థి 5వ తరగతి చదువుతున్నాడు. ఆ స్కూల్ టీచర్ పనిష్మెంట్ పేరుతో దాదాపు మూడు గంటల పాటు కుర్చీలో నిలబెట్టి౦ది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ విద్యార్థి తన చివరికోరిక అంటూ.. రాసిన సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ లేఖలో "ఇక ఎవరినీ అంత బాగా కొట్టవద్దని మా టీచర్కి చెప్పండి ప్లీజ్".. అంటూ ఆ విద్యార్థి పేర్కొన్నాడు. ఇంత జరిగిన ఆ స్కూల్ యాజమాన్యం ఈ ఘటనపై స్పందించకపోవడం గమనార్హం.