నిరుద్యోగులకు రూ. 3 వేల భృతి : ఉత్తమ్ కుమార్

SMTV Desk 2017-09-20 17:04:31  Cm Kcr, Mission Bhagiratha Project, Pcc president Uttam Kumar Reddy

హైదరాబాద్, సెప్టెంబర్ 20 : టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేసీఆర్ అన్ని వర్గాల వారిని మోసం చేశారంటూ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం మూడు వేల మందికి కూడా మూడెకరాల భూమిని ఇవ్వలేదని.. మిషన్ భగీరథ వంటి ప్రాజెక్టులు చేయడానికి డబ్బులున్నాయి కానీ, రైతులకు రుణమాఫీ చేయడానికి డబ్బులు లేవా..? అంటూ ప్రశ్నించారు. ఖచ్చితంగా 2019లో అధికారంలోకి వచ్చి రైతన్నలకు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని తెలిపారు. అంతేకాకుండా నిరుద్యోగులకు రూ. 3 వేల భృతి ఇస్తామని, లక్ష ఉద్యోగాలను ప్రకటిస్తామని వెల్లడించారు. రానున్న ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లాలో 14 నియోజకవర్గాలు గెలిచి చూపిస్తామని ఉత్తమ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు.