‘రంగస్థలం’ లో రాంచరణ్ పంచాయితీ..!

SMTV Desk 2017-09-16 07:31:14  ramcharan, samantha, sukumar, rangasthalam, devisri pasad, mythri movies

హైదరాబాద్ సెప్టెంబర్ 16: సుకుమార్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘రంగస్థలం’, ఈ చిత్రకథా నేపథ్యమంతా 1985 సంవత్సరం లోనిది. అప్పట్లో పల్లె టూర్లలో ఎవైన సమస్యలు ఎదురైతే పోలీసుల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరిగేవారు కాదు, పంచాయితీకే వెళ్ళేవారు, అక్కడే సమస్యలు పరిష్కరించుకునేవారు. ఇపుడు రామ్ చరణ్ కూడా పంచాయితీ చుట్టూనే తిరుగుతున్నాడని, తన సమస్యను పరిష్కరించుకోవడానికి ఎంతో కష్టపడుతున్నాడని సమాచారం. ఇదంతా ‘రంగస్థలం’ సినిమాలో చిత్రీకరణ జరుగుతున్న సంఘటనలు. ఈ సినిమాలో ఎక్కువ శాతం కథ పంచాయతి చుట్టూ నే తిరుగుతుందని సమాచారం. మరి రామ్‌చరణ్‌ ఎందుకు వెళ్ళారో, ఎవరితో గొడవ పడ్డారో తెలుసుకోవాలంటే కొన్నాళ్ళు ఎదురుచూడక తప్పదు. సమంతా హీరోయిన్ గా మొదటిసారి రామ్ చరణ్ సరసన నటిస్తుంది, ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ పథకం పై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్‌ చెరుకూరి (సీవీయమ్‌) నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతమందిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు.