హైదరాబాద్, సెప్టెంబర్ 13 : నగరంలో కలకలం రేపిన చాందిని హత్య కేసులో సాయికిరణ్ ను ని౦దితుడిగా నిర్ధారించిన పోలీసులు అతనిని మీడియా ముందుకు ప్రవేశపెట్టారు. ఈ కేసులో చాందిని స్నేహితులను విడివిడిగా ప్రశ్నించిన సైబరాబాద్ పోలీసులు వారు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా దర్యాప్తును కొనసాగించినట్లు వెల్లడించారు. అంతేకాకుండా సీసీ కెమెరాలో కొన్ని కీలక ఆధారాలను సేకరించిన అధికారులు, చాందినిని తీసుకెళ్ళేటప్పుడు నిందితుడి వెనుక భాగం మాత్రమే కనిపించిందని తెలిపారు. ఈ కేసులో మొదట సాయి కిరణ్ తప్పించుకునే ప్రయత్నం చేసినా, కొన్ని బలమైన ఆధారాల సహాయంతో అతడినే నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీస్ కమీషనర్ సందీప్ శాండిల్యా వెల్లడించారు. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేయగా, చాందినిపై ఎలాంటి అత్యాచార౦ జరగలేదని ఆయన స్పష్టం చేశారు.