న్యూఢిల్లీ, సెప్టెంబరు 13: ఎనిమిదేళ్లుగా విడిగా ఉంటూ.. విడాకుల కోసం దరఖాస్తు చేసిన ఒక జంట, ఆరు నెలల కాల వ్యవధి సడలించాలంటూ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. జస్టిస్ ఏకే గోయల్, జస్టిస్ లలిత్తో కూడిన ధర్మాసనం ఈ కేసు విచారణ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో విడిపోతామంటూ కోర్టును ఆశ్రయించిన భార్యాభర్తలు ఎట్టిపరిస్థితుల్లోనూ కలిసి జీవించే అవకాశం లేనప్పుడు ఆరు నెలల కూలింగ్ పీరియడ్ లేకుండానే ట్రయల్ కోర్టులు వారికి విడాకులు మంజూరు చేయవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.