రాజమండ్రి, సెప్టెంబర్ 11 : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో ఎంతో సీనియర్ నాయకుడు. కనీసం తన వయసుకైనా గౌరవం ఇవ్వాల్సిందిగా ప్రతిపక్ష నేత జగన్ కు కాంగ్రెస్ పార్టీ మాజీ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ సలహా ఇచ్చారు. ఓ కార్యక్రమం లో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతు జగన్ ఇతరులను గౌరవించడం నేర్చుకుంటే ప్రజల మదిలో మంచి స్థానాన్ని సంపాదించుకోవచ్చని సూచించారు. చంద్రబాబు వైఖరి ఎంతో తప్పని, అసలు ఇలాంటి అబద్దాలు చెప్పే సీఎంను తానూ ఇప్పటివరకు చూడలేదన్నారు. అయినా, ఆయన వయసుతో పోలిస్తే తక్కువ వయసున్న జగన్ ఓపిక వహిస్తేనే మంచిదని తెలిపారు. పోలవరం పనులు ఏడాదికి 3 శాతం మాత్రమే జరుగుతున్నాయని, అసలు ఈ ప్రాజెక్టు ఇంకో పదేళ్ళైన పూర్తి కాబోదని ఎద్దేవా చేసారు. ప్రాజెక్టుల పేరిట చంద్రబాబు సర్కారు అవినీతి అక్రమాలకు పాల్పడుతుందని తీవ్ర స్థాయిలో విమర్శించారు.