సాహో లో శ్రద్ధాకపూర్ ద్విపాత్రాభినయం

SMTV Desk 2017-09-10 21:18:28  prabas, saaho, sujith, shraddha kapoor

హైదరాబాద్ సెప్టెంబర్ 10 : ప్రభాస్ నటిస్తున్న చిత్రం సాహో, ఈ చిత్రం సుజిత్ దర్శకత్వంలో రాబోతుంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతున్నది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాలో పరిచయమవుతున్న శ్రద్ధాకపూర్ ద్విపాత్రాభినయంలో కనిపించనుందని తెలిసింది. రెండు పాత్రల్లో ఒకటి ప్రతినాయిక ఛాయలతో సాగుతుందని ఈ పాత్ర కోసం ఆమె పోరాట ఘట్టాల్లోనూ పాల్గొననుందని, మరొకటి అమాయకురాలైన పాత్ర అని చిత్ర వర్గాల సమాచారం. ఈ చిత్రాన్ని 150 కోట్ల భారీ బడ్జెట్‌తో యు.వి.క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.