న్యూఢిల్లీ: 1500 రూపాయలకే రిలయన్స్ జియో ఫీచర్ఫోన్ను తీసుకురావడంతో ఎయిర్టెల్ కూడా అదే బాటలో అడుగులు వేస్తునట్లు సమాచారం. ఈ నేపథ్యంలో టెలికాం దిగ్గజం సంస్థ ఎయిర్టెల్ 4జీ స్మార్ట్ఫోన్ను తీసుకొచ్చేందుకు మొబైల్ ఫోన్ తయారీ సంస్థలతో మంతనాలు జరిపినట్లు తెలిసింది. ఎయిర్టెల్ తీసుకురానున్న 4జీ స్మార్ట్ఫోన్ ధర రూ.2500-2700 ఉండే అవకాశం ఉందని టెలికాం శ్రేణులు అంటున్నాయి. ఈ 4జీ స్మార్ట్ఫోన్ను దీపావళి కానుకగా వినియోగదారులకు అందించే యోచనలో ఉందట. అంతే కాకుండా వాయిస్ ప్లాన్, డేటాల ధరలు కూడా అందుబాటులో ఉండే విధంగా సన్నాహాలు చేస్తున్నారట. ఐనా ఇంతవరకు ఎయిర్టెల్ ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు.