నేడు పీపుల్స్ ప్లాజా వద్ద నిర్వహించిన 2కే రన్

SMTV Desk 2017-09-10 14:11:47  2k Run, peoples plaza, DGP anurag sharma, World Suicide Prevention day

హైదరాబాద్, సెప్టెంబర్ 10 : నేడు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజధానిలో పీపుల్స్ ప్లాజాలో చేపట్టిన 2కే రన్ ను డీజీపీ అనురాగ్ శర్మ ప్రారంభించారు. ఇండియన్ సైకియాట్రిస్ట్ సొసైటీ ఆధ్వర్యంలో ఆత్మహత్యలు నిర్ములించాలంటూ పరుగు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు సైకియాట్రిస్ట్ లతోపాటు యువతి, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చనిపోయేముందు ఒక్క క్షణం ఆలోచిస్తే, ఆత్మహత్యలు ఉండబోవని అవగాహనా కల్పించారు. ఈ నేపథ్యంలో బాధలో ఉన్న వారు బలవన్మరణానికి పాల్పడకుండా తోటివారు అవగాహనా కల్పించాలని ఆయన పేర్కొన్నారు.