హైదరాబాద్, సెప్టెంబర్ 08 : బంగారు తెలంగాణ సాకారం కావాలంటే రాష్ట్రంలో మానవనరుల అభివృద్ధి జరగాల్సిందేనని ఉపముఖ్యమంత్రి కడీయం శ్రీహరి పేర్కొన్నారు. విద్యా వ్యవస్థ పటిష్టంగా ఉన్నప్పుడే మానవనరులను తీర్చిదిద్దవచ్చని తెలిపారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించిన గురుపూజోత్సవంలో పాల్గొన్న కడియం ఉపాధ్యాయులు మరింత బాధ్యతగా పని చేయవలసిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రులు ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవులు హజరయ్యారు. రాష్ట్ర ఉత్తమ పురస్కారాలకు ఎంపికైన వారిని సత్కరించారు.