హైదరాబాద్ సెప్టెంబర్ 8: తెరాస ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పాలిట శాపంగా మారాయని మంత్రి హరీశ్రావు అన్నారు. తమ ప్రభుత్వం చేపట్టిన పథకాలను రైతులు మెచ్చుకుంటున్నారని తెలిపారు. మీడియా తో మాట్లాడుతూ అధికారానికి దూరమైన బాధలో కాంగ్రెస్ పార్టీ ఉందని విమర్శించారు. రైతులు, ప్రజలు కూడా బాధలోనే ఉండాలనేది కాంగ్రెస్ ధోరణి అని దుయ్యబట్టారు. రైతులను ఆతనున్యతా భావంలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులనుద్దేశించి వ్యాఖ్యానించారు. రాజకీయ లబ్ధికోసం అసత్య ప్రచారాలు చేయొద్దని సూచించారు. మిషన్ కాకతీయను చూసి ఇతర రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో నిర్లక్ష్యం చేసిన చెరువులకు తాము పూర్వవైభవం తీసుకొచ్చామని అన్నారు. కాంగ్రెస్ హయాంలో రైతులకు కనీసం ఆరు గంటల విద్యుత్ను ఇవ్వలేకపోయిందనివి మర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో ఎన్ని ఇబ్బందులున్నా రైతులకు 24 గంటల విద్యుత్ను ఇస్తున్నామని తెలిపారు.