హర్యానా, సెప్టెంబర్ 8: డేరా బాబా ముసుగులో పడిన సాద్విలను రేప్ చేసిన కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న గుర్మిత్ సింగ్... హైకోర్టు ఆదేశాలతో హర్యానా సిర్సా లో 800 ఎకరాల డేరా హెడ్ క్వార్టర్స్ లో పోలీసులు, పెద్ద సంఖ్యలో పారా మిలటరీ బలగాలు సోదాలు చేపట్టాయి. డేరా ప్రధాన కార్యాలయంలోకి బాంబ్ స్క్వాడ్ బృందం తమ శునకాలతో వెళ్లి తనిఖీలు నిర్వహించగా, పదుల సంఖ్యలో అస్థి పంజరాలు బయటపడ్డట్టు తెలుస్తోంది. వీటిల్లో కొన్ని పురుష, మరికొన్ని మహిళలు, బాలికల అస్థి పంజరాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఎంతో మంది భక్తులు డేరాకు వచ్చి, తాము మరణించిన తరువాత ఇక్కడే పూడ్చి పెట్టాలని కోరారని, వారి కోరిక, గుర్మీత్ విధించిన నిబంధనల మేరకే వారిని మరణానంతరం ఇక్కడ పూడ్చి పెట్టామని తెలిపారు. ఈ నేపథ్యంలో అస్థి పంజరాలు ఎవరివి? వారు ఎలా మరణించారు? తదితర విషయాలపై విచారణ జరపాలని నిర్ణయించిన పోలీసులు, వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కు తరలించే పనిలో ఉన్నారు. కాగా, ఇక్కడి అసాంఘిక కార్యకలాపాలపై ఎవరైనా ప్రశ్నిస్తే, వారిని హత్య చేసి, ఇక్కడ పూడ్చేవారన్న ఆరోపణలు గతంలో వచ్చిన సంగతి తెలిసిందే.