న్యూ ఢిల్లీ, సెప్టెంబర్ 07 : సైనిక బలగాలే తన తొలి ప్రాధాన్యతని రక్షణమంత్రి నిర్మల సీతారామన్ స్వష్టం చేశారు. రక్షణమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సీతారామన్ అత్యంత కీలకమైన బాధ్యతలను తనకు అప్పగించిన ప్రధాని నరేంద్ర మోదీ కి కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం జరిగిన కేంద్ర మంత్రిమండలి పునర్వవ్యవస్థీకరణలో భాగంగా రక్షణమంత్రిగా పదోన్నతిని పొందిన నిర్మల నేడు బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు రక్షణమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అరుణ్ జైట్లీ ఆమెకు లాంచనంగా బాధ్యతలు బదలాయించారు. ఇందిరాగాంధీ తర్వాత అత్యంత కీలకమైన రక్షణశాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న రెండో మహిళ మంత్రిగా నిర్మల సీతారామన్ రికార్డులోకి ఎక్కారు. ఈ నేపథ్యంలో పలు నేతలు ఆమెను అభినందించారు.