‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో నటించనున్న ప్రగ్యా జైశ్వాల్‌

SMTV Desk 2017-09-04 15:02:39  megastar, chiranjeevi, ramcharan, pragya jaiswal, sairaa narsimhareddy

హైదరాబాద్ సెప్టెంబర్ 4 : నటి ప్రగ్యా జైశ్వాల్‌, ఇప్పుడు మెగాస్టార్‌ చిరంజీవి చిత్రంలో నటించే అవకాశం దక్కించుకుందట. ఈ చిత్రంలో ప్రగ్యా ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం. ఈ చిత్రంలో చిరుకి జోడీగా నయనతార నటిస్తోంది. ఇందులో మొత్తం ముగ్గురు కథానాయికలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల చిరు పుట్టినరోజును పురస్కరించుకుని విడుదల చేసిన చిత్ర మోషన్‌ పోస్టర్‌ కి మంచి స్పందన వచ్చింది. చిరంజీవి 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ ని రాంచరణ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.