రైల్వే సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుతున్న సురేష్ ప్రభు

SMTV Desk 2017-09-03 15:45:02  Railway Department, Thanks to the railway staff, Suresh Prabhu , Twitter

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3 : కేంద్ర కేబినెట్ లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం సందర్భంగా రైల్వే శాఖతో తన బంధం ముగిసిందని కేంద్ర రైల్వే శాఖ మాజీ మంత్రి సురేష్ ప్రభు ట్విట్టర్ లో స్పందిస్తూ కొత్త మంత్రులకు శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు పలు ట్వీట్లు చేశారు. రైల్వే శాఖ మంత్రిగా తన బాధ్యతలు నేటీతో ముగిశాయని ఆయన అన్నారు. ఇంత కాలం తనకు సహాయ సహకారాలు అందించిన రైల్వే కుటుంబానికి ధన్యవాదాలు తెలుపుతూ, రైల్వేలలో సహాయం, సమస్యల పరిష్కారానికి ఆ శాఖకు చెందిన ఉన్నతాధికారుల వివరాలను ఈ సందర్భంగా పోస్టు చేశారు. 13 లక్షల మందితో కూడిన రైల్వే కుటుంబంతో గడిపిన అనుభవాలు ఎప్పటికీ గుర్తుంటాయని ఆయన వెల్లడించారు.