తమిళనాడులో మరో పురాతన భవనం కుప్పకూలింది

SMTV Desk 2017-09-03 10:17:17  thamilanadu, thiruchhi, mallai kutti, gandhinagar

తమిళనాడు, సెప్టెంబర్ 3: రెండు రోజుల క్రితం 100 ఏళ్ల భవనం కుప్పకూలిన ఘటన మరువకముందే... గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇప్పుడు తమిళనాడులోని తిరుచ్చి జిల్లా మల్లయైకుట్టి గ్రామంలోని గాంధీనగర్ లో పురాతనమైన మూడంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఈ భవనంలో మొత్తం 5 కుటుంబాలు నివాసముంటున్నాయి. ఈ దుర్ఘటన తెలిసిన వెంటనే హుటాహుటిన రంగలోకి దిగి సహాయక చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, తీవ్రంగా గాయపడ్డ మరో ముగ్గురిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించామని అధికారులు తెలిపారు. ఇంకా శిథిలాల కింద దాదాపు 20 మంది వరకు చిక్కుకొని ఉన్నారని, సహాయక బృందాలు తెలిపాయి.