ముంబైలో భవనం కూలిన ఘటనలో 34కు చేరిన మృతుల సంఖ్య

SMTV Desk 2017-09-01 18:28:50  The 130-year-old building, Death toll 34, Bhindi Bazaar,Maharashtra Chief Minister Devendra Fadnavane

ముంబై, సెప్టెంబర్ 1 : ముంబైలో 130 ఏళ్ల నాటి భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 34కు చేరింది. గత కొన్ని రోజుల నుంచి భారీ వర్షాలు కురవడంతో దక్షిణ ముంబైలో రద్దీగా ఉండే భిండీ బజార్ ప్రాంతంలో గురువారం భవనం కూలగ ఈ దుర్ఘటన మృతుల్లో 9 మంది మహిళలు ఉన్నారు. రాత్రి వేళలో వెలికితీత కొనసాగగా శిథిలాల కింద చిక్కుకున్న 37 మందిని అధికారులు రక్షించారు. ఈ ప్రమాదంలో గాయపడిన బాధితుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ ఘటన బాధితులపై కఠిన చర్యలు తప్పవని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ హెచ్చరించిన నేపథ్యంలో ఈ ప్రమాద కారణాలపై దృష్టి సారించిన అధికారులు దీనికి గల బాధ్యులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.