హైదరాబాద్, జూన్ 4: వేసవికాలం ఎండలతో విలవిలలాడిన తెలుగు రాష్ట్రాల ప్రజలు కాస్త ఊరట కలిగే సమాచారాన్ని వాతావరణశాఖ ప్రకటించింది. రానున్న 24 గంటల్లో రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కరిసే అవకాశం ఉందని వాతావరణ శాఖా వెల్లడించింది. తెలంగాణాలో అక్కడక్కడ ఉరుములు మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు, రాయలసీమ, కోస్తాలో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఇక శుక్రవారం రాత్రి తెలంగాణా రాజధాని లో కురిసిన భారీ వర్షం కు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అదే విధంగా జయశంకర్ జిల్లా, ఏటూరునాగారం, మంగపేట మండలాల్లో వర్షం తాకిడి అధికంగానే ఉంది. రాయలసీమలో అక్కడక్కడ మెరుపులతో కూడిన వర్షాలు కురిసాయి.