అవినీతిని తొలగించాలన్న మోదీ కృషికి ఎన్జీవో సంస్థ ప్రశంసలు

SMTV Desk 2017-09-01 16:12:00  India Development, Corruption, Prime Minister Modis government,Germany,NGOs company, Survey, asiya

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1 : భారత్ అభివృద్ధికి అడ్డుగా మారిన అవినీతిని తొలగించాలన్న ప్ర‌ధాని మోదీ ప్ర‌భుత్వ ల‌క్ష్యం ఇప్ప‌ట్లో నెర‌వేరేది కాద‌ని జర్మనీకి చెందిన ఎన్జీవో సంస్థ ఖరాఖండిగా తేల్చి చెప్పింది. భార‌త్‌లో ఆసియాలోనే అత్యంత అవినీతి ఉంద‌ని తాజాగా పోర్బ్‌స్ చేపట్టిన ఓ సర్వేలో తేలిందన్నారు. ఆసియాలో అత్యంత అవినీతి జ‌రుగుతోన్న ఐదు దేశాల జాబితాలో వియ‌త్నాం, పాకిస్థాన్‌, థాయిలాండ్‌, మయ‌న్మార్ ల‌ను భార‌త్ వెనక్కు నెట్టిందన్నారు. భార‌త్‌లోని పాఠ‌శాల‌లు, ఆసుపత్రులు, ధ్రువీకరణ పత్రాలు జారీ చేసే కార్యాల‌యాల్లో, పోలీసులలో అవినీతి అధికంగా ఉంద‌ని, మ‌రోవైపు అవినీతిని తొలగించే విష‌యంలో భారత ప్రధాని మోదీ చేస్తోన్న కృషిపై ఆనందం వ్యక్త పరిచారు. అవినీతిని రూపుమాపే విషయంలో మోదీ ఎన‌లేని కృషి చేస్తున్నారని భారతీయుల్లో చాలా మంది అభిప్రాయాన్ని వ్యక్త పరుస్తున్నారు. కాగా, ఈ స‌ర్వేను 18 నెల‌ల పాటు 16 దేశాల్లో 20,000 మంది నుంచి అభిప్రాయాల‌ను సేక‌రించి చేసినట్లు సమాచారం.