పార్క్ చేస్తే మటాష్ ...

SMTV Desk 2019-11-29 16:21:02  

జల్సాలకు అలవాటు పడి పార్క్ చేసి ఉన్న బైక్ లను అమ్ముకుంటున్న దొంగను, వాటిని కొంటున్న మరో వ్యక్తిని అప్జల్ గంజ్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 10 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించారు.

సిద్దంబర్ బజార్ కు చెందిన నాగరాజు(19), రంజిత్ (22) లు తమ జల్సాల కోసం బయట పార్క్ చేసి ఉన్న వాహనాలను దొంగిలించేవారు. అప్జల్ గంజ్, షా ఇనాయత్ గంజ్, సుల్తాన్ బజార్, నారాయణ గూడ,ముషీరాబాద్, పోలీస్ స్టేషన్ ల పరిధిలలోని ప్రాంతాలలో పార్క్ చేసి ఉన్న వాహనాలు దొంగిలించి, వాటిని కాలిఖబర్ కు చెందిన ప్రశాంత్ కు అమ్మేవారు.

బుధవారం అప్జల్ గంజ్ పీఎస్ పరిధిలోని సిద్దిఅంబర్ బజార్ వద్ద వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులకు నాగరాజు అనుమానస్పద రీతిలో కనిపించాడు. పోలీసులు అతన్నిపట్టుకుని విచారణ చేయగా.. చేసిన తప్పుల్ని ఒప్పుకున్నాడు. విచారణలో వాహనాలు కొన్న ప్రశాంత్ ను కూడా అరెస్ట్ చేసినట్లు తూర్పు మండలం అదనపు డీసీపీ గోవింద్ రెడ్డి తెలిపారు. పరారీలో ఉన్న రంజిత్ ను కూడా త్వరగా పట్టుకుంటామని ఆయన తెలిపారు.